పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వండి

Facebook
X
LinkedIn

తెలంగాణ సర్కారుకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి.

జూన్ -5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ అధ్యక్షులు రంగయ్య డిమాండ్లు విడుదల

హైదరాబాద్ :

“విశ్వనగరం”, “స్వచ్ఛ నగరం”గా ప్రకటించబడిన హైదరాబాద్ మహానగరం, ఇప్పుడు చెత్త కుప్పలతో అస్తవ్యస్తంగా మారింది. ఈ పరిస్థితిపై “ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్” (EPDC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కౌన్సిల్ అధ్యక్షులు రంగయ్య ప్రభుత్వం, పౌరులతో కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలని పలు కీలక డిమాండ్లు విడుదల చేశారు.

“చెత్త రోడ్లపై వేసే హక్కు ఎవరిచ్చారు?”

“అధికారులు ‘స్వచ్ఛ హైదరాబాద్’ గురించి మాట్లాడుతున్నారు, కానీ నిజానికి ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, దుర్గంధం, రోగాల విజృంభణ తప్ప మరేమీ కనిపించడం లేదు” అని ఆయన విమర్శించారు. GHMC ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు విఫలమవుతోందని, ఇది పర్యావరణ చట్టాల ఉల్లంఘన అని ఆయన స్పష్టం చేశారు . అందుకు పలు డిమాండ్ లు చేశారు. కఠిన చట్టాలు & పటిష్ట అమలు చేయాలి ⁠. చెత్తను బహిరంగంగా పారవేసే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. జరిమానాలు మాత్రమే కాకుండా, పునరావృతంగా ఉల్లంఘించేవారికి కఠిన శిక్షలు విధించాలి. ప్రస్తుతం GHMC ఈ-చలాన్ వ్యవస్థ ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు బలహీనంగా ఉంది .

2. పౌరుల బాధ్యత: అపార్ట్‌మెంట్లలో తప్పనిసరి చెత్త డబ్బాలు

ప్రతి కుటుంబం తమ చెత్తను ఇంట్లోనే నిల్వ చేసుకోవాలి. అన్ని అపార్ట్‌మెంట్ సముదాయాలు తమ ప్రాంగణంలో మూతగల చెత్త డబ్బాలు ఏర్పాటు చేయాలి. ఇది రోడ్లపై చెత్త వేయడాన్ని తగ్గిస్తుంది .

ప్రభుత్వ చిత్తశుద్ధి & సామాజిక బాధ్యత.

పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకోవాలి. GHMC అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, సమస్యలను నేరుగా పరిష్కరించాలి . ప్రజల ఆరోగ్యం, పర్యావరణ సంరక్షణ కోసం స్థిరమైన చర్యలు తీసుకోవాలి . పర్యావరణ దినోత్సవం సందర్భంగానైనా హైదరాబాద్‌ను నిజంగా “స్వచ్ఛ నగరం”గా మార్చాలంటే, ప్రభుత్వం, పౌరులు కలిసి పనిచేయాలని రంగయ్య పిలుపునిచ్చారు. “చెత్త సమస్య పరిష్కారం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి సహకారం అవసరం” అని ఆయన పేర్కొన్నారు. కౌన్సిల్ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.