మహిళలకు గ్రామపంచాయతీలలో రిజర్వేషన్ ఇప్పించిన ఘనత రాజీవ్ గాంధీ దే

Facebook
X
LinkedIn

పి సి సి అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్ :
మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో, మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పి సి సి అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు మహిళలకు గ్రామపంచాయతీలలో రిజర్వేషన్ ఇప్పించిన ఘనత శ్రీ రాజీవ్ గాంధీ దే అని అన్నారు.దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు, మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ అని అన్నారు. తదితరులు పాల్గొన్నారు.