కిన్నెరసాని నదిపై హై లెవెల్ వంతెన ప్రారంభం

Facebook
X
LinkedIn

తెలుగునాడు, పాల్వంచ  :

పాల్వంచ మండలంలోని యానం బైల్ గ్రామం వద్ద గల కిన్నెరసాని నదిపై రూ.9.70 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ వంతెనను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి వంతెనను దాదాపు పూర్తి చేయడం జరిగింది. 

అసెంబ్లీ ఎన్నికలు రావడం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత వంతెనకు ఇరువైపుల అప్రోచ్ రోడ్లను ఇటీవల కాలంలో పూర్తి చేశారు.అలాగే మండలంలోని బిక్కుతండా, సోములగూడెం గ్రామాల మధ్య గల బూడిద వాగుపై రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించే హై లెవెల్ వంతెన నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాం రెడ్డి ఎమ్మెల్యేలు కూనమనేని సాంబశివరావు, రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, ఎంఈఓ శ్రీరామ్మూర్తి, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.