తెలుగునాడు,
హైదరాబాద్ :
బిఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి హరీశ్రావుతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ సమావేశం అయ్యారు. హరీశ్ నివాసానికి వెళ్లి కెటిఆర్ అనారోగ్యంతో ఉన్న హరీశ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై ఇద్దరు సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపారు.ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న వార్తలను హరీశ్రావు ఖండించిన విషయం తెలిసిందే. అధినేత కెసిఆర్ ఏదీ చెప్తే ఓ కార్యకర్తగా దాన్ని పాటిస్తానని ఆయన అన్నారు. ఒకవేళ కెటిఆర్కు పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చిన స్వాగతిస్తానని పేర్కొన్నారు. తనపై కుట్రలు చేస్తున్నారని, సమయం వచ్చినప్పుడు బయటపెడతానని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కెటిఆర్ హరీశ్ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.