సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన  తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఎట్టబోయిన సాయి శివానికి 11వ ర్యాంకు వచ్చింది. ఇక బన్నా వెంకటేశ్‌ 15వ ర్యాంకు సాధించాడు. అభిషేక్‌ శర్మకు 38వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డికి 46వ ర్యాంకు, శ్రవణ్‌కుమార్‌ రెడ్డికి 62వ ర్యాంకు, సాయి చైతన్య జాదవ్‌కు 68వ ర్యాంకు, ఎన్‌ చేతనరెడ్డికి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివగణేష్‌ రెడ్డికి 119వ ర్యాంకు వచ్చాయి.యితే ఈసారి టాప్‌-10 జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఒక్కరు కూడా లేరు. శక్తి దూబే అనే అభ్యర్థికి ఫస్ట్‌ ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత హర్షిత గోయెల్‌, డోంగ్రే అర్చిత్‌ పరాగ్‌, షా మార్గి చిరాగ్‌, ఆకాశ్‌ గార్గ్‌, కోమల్‌ పూనియా వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు ర్యాంకులు సాధించారు.

ఆయుషి బన్సల్‌, రాజ్‌కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్‌ అగర్వాల్‌, మయాంక్‌ త్రిపాఠిలు వరుసగా 6 నుంచి 10 ర్యాంకులు దక్కించుకున్నారు.కాగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1056 ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29వ వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్‌లో సత్తాచాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్‌ 17 వరకు దశల వారీగా పర్సనల్‌ ఇంటర్వ్యూలు చేశారు.తాజాగా తుది ఫలితాలను ప్రకటించారు. మొత్తం 1,009 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా జనరల్‌ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 109 మంది, ఓబీసీ నుంచి 318 మంది, ఎస్సీ కేటగిరీలో 160 మంది, ఎస్టీ కేటగిరీ నుంచి 87 మంది చొప్పున ఉన్నారు.