సింగపూర్ కాన్సూల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో భేటీ

Facebook
X
LinkedIn

తెలుగునాడు,

చెన్నైలోని సింగపూర్ కాన్సూల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయింది. జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పాంగ్ తో పాటు సమావేశంలో కాన్సూల్ (పొలిటికల్) వైష్ణవి వాసుదేవన్ గారు, ఫస్ట్ సెక్రటరీ (ఎకానమిక్) వివేక్ రఘు రామన్ గారు, ఎంటర్ ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్ (ఇండియా – సౌత్) డేనిస్ టామ్ గారితో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గారు, హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ గారు ఇతర అధికారులు పాల్గొన్నారు.