పటాన్ చెరు జాతీయ రహదారి  పై ఆర్టిసి బస్సుకు తప్పిన ప్రమాదం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాతీయ రహదారి 65 పై ఆర్టిసి బస్సుకు ప్రమాదం తప్పింది. ముత్తంగి గ్రామ సమీపంలో ముందు ఉన్న కార్లను తప్పించబోయి బ్రేక్ పడకపోవడంతో డివైడర్ ఎక్కించి కరెంట్ స్తంభానికి ఆర్టిసి బస్సు ఢీకొంది. మేడ్చల్ డిపోకు చెందిన బస్సు మేడ్చల్ నుండి బాలానగర్ మీదుగా ఇస్నాపూర్ వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు సమాచారం మేరకు పటాన్ చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడకపోవడంతో ఆర్ టిసి, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. అదే విధంగా నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి బస్సు అదుపు తప్పి బురదలో కూరుకుపోయింది. రహదారిపై రోడ్డుకు అడ్డం బస్సు తిరగడంతో బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. సుమారు గంట పాటు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.