రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో భారీగా పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. 935 కిలోల గంజాయిని వాహనంలో తీసుకెళ్తుండగా ఈగల్ టీమ్, రాచకొండ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. పండ్ల ట్రేలల్లో దాచి ఉంచిన 455 గంజాయి సంచులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని డిసిఎంలో ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా  పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి డిసిఎం, కారు స్వాధీనం చేసుకున్నారు.