తెలంగాణలో రాబోయే మూడురోజుల వర్షాలు

Facebook
X
LinkedIn

హైదరాబాద్ ;

తెలంగాణలో రాబోయే మూడురోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ క్రమంలో ఈ మూడు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.