తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధం

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకురెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి కొత్త అధ్యక్షులుతెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు రేపు నోటిఫికేషన్ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంజులై 1 నాటికి కొలిక్కి రానున్న అధ్యక్షుల ఎంపికవిజయవాడలో షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల అధికారిబీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నూతన అధ్యక్షులను ఎన్నుకునేందుకు పార్టీ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. రెండు రాష్ట్రాలకు దాదాపు ఒకే సమయంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, జులై 1న నూతన సారథులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాయి.