దమ్మైగూడ మున్సిపల్ కమీషనర్ ను కలిసిన సిపిఎం నేతలు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, కీసర :

దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఎం పార్టీ నేతలు. దమ్మాయిగూడ మున్సిపల్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి ని శాలువాతో సన్మానించి హరితహారం మొక్కను బహుకరించడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం వినోద మాట్లాడుతూ ప్రజలు నిత్యం ఎదుర్కొనే మంచి నీరు, డ్రైనేజి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. వినోద, సిపిఎం కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు మరియు చింతకింది అశోక్ తదితరులు పాల్గొన్నారు.