తెలుగునాడు, కీసర :
కీసర మండల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం కోసం సిఐటియు వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మేడ్చల్ జిల్లా నాయకులు బంగారు నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడానికి ప్రత్యేకించాలి కార్మికులను కోరారు, జూలై 9వ తేదీన దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికులు, కర్షకులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుందనపల్లి, శ్రీ రామలింగేశ్వర స్వామి కాలనీ, రాజీవ్ గృహకల్ప ప్రాంతంలోని మున్సిపల్ వర్కర్స్ పాల్గొనడం జరిగింది.