తెలుగునాడు, కాప్రా :
ఇరాన్ పై ఇజ్రాయిల్ , అమెరికా దేశాలు జరుపుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి. శాంతిని నెలకొల్పాలని సిపిఎం మేడ్చల్ జిల్లా కమిటీ కార్యదర్శి పి .సత్యం అన్నారు.
సిపిఎం కాప్రా సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో కమలానగర్ పార్టీ ఆఫీస్ నుండి ఈసీఐఎల్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ ఇరాన్ లో రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు మోపి ఇజ్రాయిల్, ఇరాన్ పై బాంబులతో దాడులకు పాల్పడిందని అన్నారు. ఇరాన్ లో అన్వాయిదాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి అమెరికా సర్వే చేస్తే అలాంటిది ఏమీ లేదని తేలినప్పటికీ ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ పై అమెరికా యుద్ధం చేయడము సిగ్గుచేటు అన్నారు. ఇది సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసమే అమెరికా ఇరాన్ పై దాడులకు పాల్పడుతున్నదని అన్నారు .ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడం కోసం అమెరికా ఇజ్రాయిల్ సహాయంతో ఇరాన్ పై దాడులు చేస్తుందని విమర్శించారు. అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేసి ఇరాన్ సార్వభౌమధికారాన్ని దెబ్బతీసేలా అమెరికా ఈ దాడులకు పాల్పడుతుందని అన్నారు. ఇరాన్ అన్వాయిదాలు తయారు చేస్తున్నాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ అంతర్జాతీయ అనుశక్తి సంస్థ, అమెరికా ఇంటెలిజెన్సీ సంస్థలు వెల్లడించిన కూడా తయారు చేస్తున్నదని నేపముతో ఇరాన్ పై దాడికి పూనుకోవటం ఉద్రిక్తలను రెచ్చగొట్టడమేనని అన్నారు. ఇది ప్రపంచశాంతికి భంగం కలిగించడంతోపాటు పచ్చిమాసియా పై ఆధారపడుతున్న భారత వంటి దేశాలు కార్మికులు, సాధారణ ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అమెరికా దుశ్చర్యను రష్యా, చైనా ,క్యూబా, వెనుజుల ఖండించిన మన దేశ ప్రధాని స్పందించకపోవడం బిజెపి ద్వందనీతికి నిదర్శనమని అన్నారు . అమెరికా సామ్రాజ్యవాద చర్యను భారత ప్రభుత్వం ఖండించాలని, అమెరికా ఇజ్రాయిల్ అనుకూల విదేశాంగ విధాన వైఖరిని విడనాడి, శాంతిని కోరుకునే విధంగా తన వైఖరి ఉండాలని అన్నారు. శాంతిని కోరె వారందరూ అమెరికా సామ్రాజ్యవాద దాడిని ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆర్. అరుణ జ్యోతి మేడ్చల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. శ్రీనివాసులు, ఏం. వినోద, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ . శ్రీనివాస్ , నాయకులు జి. యాదగిరి రావు, శ్రీమన్నారాయణ, పీ గణేష్, ఎం శ్రీనివాసరావు, పి.బి చారి , ఎస్. శరత్, సృజన, సఫియా, శివరామకృష్ణ, ప్రభాకర్, అశోక్, శశాంక్, కృష్ణమాచార్యులు ,మంగ ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు .
