బీఆర్ఎస్పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
హైదరాబాద్ :
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డి వాంగ్మూలాలను ఇవాళ(మంగళవారం) సిట్ అధికారులు నమోదు చేశారు. 2023 నవంబర్ ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 4వేల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు కనుక్కున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈటల స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని తనేనంటూ ఈటల ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, గన్మెన్లు ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు అంతకుముందు, తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్కి గురైనట్లు సిట్ గుర్తించింది. అలాగే.. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సిట్ అధికారులకి ఫిర్యాదు చేశారు. 2020 నుంచి 2024 వరకు తన ఫోన్ సంభాషణలను రహస్యంగా తెలుసుకున్నారని ఫిర్యాదులో మాధవరం కృష్ణారావు తెలిపారు. కుట్ర పూరితంగా కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసినట్లు సిట్కి తెలంగాణ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెజండ్ల కిషోర్ బాబు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలను సిట్ అధికారులకి కిషోర్ బాబు ఇచ్చారు.