ఔట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ డిమండ్
హైదరాబాద్ :
ప్రస్తుత పరిస్థితుల్లో ఔట్డోర్ అడ్వర్టైజింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారించాలని,, తెలంగాణలో సమగ్ర ప్రకటనల విధానం ప్రకటించాలని ఔట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (అడ్వర్టైజింగ్ పరిశ్రమ) తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమండ్ చేసింది. బుదవారం హైదరాబాద్ లో ఏర్పతుచిసిన మీడియా సమావేశం లో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మాకు సమగ్ర ప్రకటనల విధానం కావాలని, అన్ని రకాల ఏజెన్సీలను సమానంగా పరిగణించేలా పాలసీ ఉండాలని కోరారు. హోర్డింగ్ల పరిమాణం, ఎత్తుపై పరిమితులు.జనాభా వారీగా పన్ను వసూలు.అన్ని టెండర్లు పారదర్శకతతో, బహిర్గతంగా ఉండాలని కోరారు.. 5 సంవత్సరాల కాలానికి అనుమతులు ఇవ్వాలి ఏజెన్సీలకు వ్యాపార రుణాలు అందించాలిని, అన్ని ఏజెన్సీలకు సమాన అవకాశాలను కల్పించాలని విజ్ఞప్తి చేసారు.
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డుల ప్రకారం మొత్తం 2,400 హోర్డింగులు ఉన్నాయి. ఈ హోర్డింగ్లపై ప్రకటనల ద్వారా జీహెచ్ఎంసీకి ఏడాదికి రూ.30 కోట్ల ఆదాయం సమకూరేది. ప్రకటనల పన్నులు కాకుండా, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వంటి ప్రభుత్వ విభాగాలు మా వంటి ప్రకటనల ఏజెన్సీలకు హోర్డింగ్ ఏర్పాటుకు ప్రోపర్టీని లీజుకు ఇవ్వడం ద్వారా జీహెచ్ఎంసీ అదనంగా మరో రూ.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించేది. 2005 తర్వాత జీహెచ్ఎంసీ పరిధులు విస్తరించాయి. కానీ, విస్తరించిన ప్రాంతాలలో కొత్త హోర్డింగ్ల ఏర్పాటుకు అనుమతులు జారీ చేయలేదు. జీహెచ్ఎంసీ (ఓఆర్ఆర్) వరకు విస్తరించిన పరిధుల వరకు అనుమతులు ఇచ్చి ఉంటే ఇప్పటికి ఇంచుమించుగా 10,000 హోర్డింగ్లు అందుబాటులో ఉండాలి. వీటి ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ప్రకటనల పన్ను ఆదాయం సుమారు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు రాబడి ఉండేది.జీహెచ్ఎంసీ పరిధిలో 2020కి ముందు రిజిస్టర్ అయిన అడ్వర్టైజింగ్ ఏజన్సీల సంఖ్య 209గా ఉండగా, రిజిస్టర్ కాని ఏజెన్సీలు 200 వరకు ఉన్నాయి. గత ప్రభుత్వం 2020 ఏప్రిల్ 20న జీవో నంబర్ 68 తీసుకురావడంతో జీహెచ్ఎంసీ పరిధుల్లోని అన్ని హోర్డింగ్లను తొలగించారు. ఫలితంగా హోర్డింగ్ ప్రకటన ఆదాయం సున్నాకు పడిపోయింది. పర్యావసానంగా 209 రిజిస్టర్డ్, 200 రిజిస్టర్డ్ కాని ఏజెన్సీలకు ఉపాధి లేకుండాపోయింది. ఏజెన్సీలు దివాలా తీయాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేసారు.జీవో నంబర్ 68 జారీ చేసిన తర్వాత, హోర్డింగ్స్ మినహా ఇతర మాధ్యమాల ద్వారా జీహెచ్ఎంసీ సుమారుగా రూ.8-10 కోట్ల (బస్ షెల్టర్లు, మెట్రో మీడియా, పాదాచార వంతెనలు (పోబ్స్ ), గొడుగులు) ఆదాయం మాత్రమే పొందింది. అయితే, కొన్ని చట్టపరమైన సమస్యల కారణంగా ఈ రాబడిని కూడా జీహెచ్ఎంసీ ప్రస్తుతం కోల్పోతోందని వారు తెలిపారు.