ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్

Facebook
X
LinkedIn

నిప్పులు చెరిగిన ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి :

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పక్షాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆత్మ‌కూరు (ఎం) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర అన్నారు. ఆయన ఆనవాళ్లను చెరిపేస్తాన‌ని విర్రవిగుతున్న సీఎం రేవంత్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోవడం ఖాయ‌మ‌న్నారు. ఇందిరమ్మ ఇళ్ల ను అర్హులైన వారికి ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేయడం సరికాదన్నారు.నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల 28 వేల మంది దరఖాస్తులు చేసుకోవడంతో దడుసుకున్న ప్రభుత్వం జూన్ 2న రుణాల మంజూరు అనుమతి పత్రాలను ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ నిరుద్యోగులను నిరాశ పరిచిందన్నారు.బూటకపు మాటలతో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రానున్న రోజుల్లో గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను తరిమికొట్టడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి, కోరే భిక్షపతి, ప్రతికంఠం పూర్ణచందర్ రాజు, బిసు ధనలక్ష్మి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సిలిపురం అరుణ, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ దేవరపల్లి ప్రవీణ్ రెడ్డి, కొరటికల్ మాజీ సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు శంతన్ రాజు, బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు సతీష్ గౌడ్, బీఆర్ఎస్ మండల నాయకులు గనగాని మల్లేశం గౌడ్, సైదులు, మధుసూదన్, రాములు పాల్గొన్నారు.