మేడ్చల్ జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి

Facebook
X
LinkedIn

డీఈవో విజయ కుమారికి వినతి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ.

తెలుగునాడు, మేడ్చల్ జిల్లా :

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పించాలని విద్యాశాఖ అధికారి విజయ కుమారి కి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. పత్రిక రంగాన్ని నమ్ముకుని పని చేస్తున్న జర్నలిస్టులు ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. కాబట్టి జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో వీలైనంత ఎక్కువగా రాయితీ ఇప్పించవలసిందిగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) కోరుతున్నది.
ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం కూడా మీరు మా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు ఈ విషయమై ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరారు.
ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి సానుకూలంగా స్పందించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్, జిల్లా కోశాధికారి బెలిదే అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు జి రోజా రాణి, నాయకులు గడ్డమీద అశోక్, పిట్ల శంకర్, ఏ. గోవిందరావు, సంజీవ్ కుమార్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.