ఏసీపీ పి.మధుసూధన్రెడ్డి
చౌటుప్పల్ :
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తున్నదని ఏసీపీ పి.మధుసూధన్రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బడుగు రామస్వామి, కమలమ్మ, పాలకూర్ల శివయ్యగౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జ్ఞాన దీప్తి పురస్కారాలను అందజేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలో ఉన్న సౌకర్యాలను అనుకూలంగా మలుచుకుని విద్యార్థులు ఎదుగాలన్నారు. చిన్నతనం నుంచే చదువులపై ఏకాగ్రత సాధించాలన్నారు. తద్వారా భవిష్యత్లో ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రతిఒక్కరూ సమున్నత వ్యక్తిత్వం, సౌశీల్యంను పెంపొందించుకోవాలన్నారు. అంతేకాకుండా మొబైల్ పోన్ల వాడకం తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీరాములు, పాలకూర్ల మురళీ గౌడ్, దబ్బేటి శేఖర్, అక్షయ, పోలోజు రాజు, వెంకటాచారి పాల్గొన్నారు.
