ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి

Facebook
X
LinkedIn

బడిబాట కార్యక్రమం లో శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రాథనా కార్యదర్శి ఏ సుదర్శన్

ఉప్పల్  :

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి అన్న నినాదం తో ఉప్పల్ నియోజకవర్గం  రామంతపూర్  లో శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రాథనా కార్యదర్శి ఏ సుదర్శన్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.  ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్ స్కూల్లో వేయడం దేనికి సంకేతం  ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్లు  తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్లో వేయాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రైవేట్ స్కూల్లో వేయడం ప్రభుత్వాన్ని అవమానించడమే ఈరోజు మీరు ఉద్యోగాలు చేస్తుంటే ప్రభుత్వం స్కూల్లో చదివారు కదా కాబట్టి ప్రభుత్వ స్కూళ్లను గౌరవించండి, ప్రభుత్వ స్కూళ్లలో తమ తమ పిల్లలను జాయిన్ చేయండని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమం లో శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రాథనా కార్యదర్శి  అనురాధ , హెచ్ఎం  పరమేశ్వర్ రెడ్డి , స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.