తెలుగునాడు, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరుల ఆశయ సాధన కోసం అందరం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.