తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్ :
పార్టీ కార్యాలయాన్ని వ్యక్తి గత అవసరాలకు వాడుకుంటే ఊరుకోమని తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఆఫీసులో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని సూచించారు. ఇకపై..తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ముఖ్యనేతలతో సమావేశమై నేతలకు క్లాస్ ఇచ్చారు. కొందరు నేతలు వ్యక్తిగత ఎజెండాలో పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత దూషనలకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనుమతి తప్పనిసరి
పార్టీ కార్యాలయాన్ని వ్యక్తి గత అవసరాలకు వాడుకుంటే ఊరుకునేది లేదని నేతలకు గట్టిగా చెప్పారు. పార్టీ ఆఫీసులో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని సూచించారు. ఇక మీదట ప్రెస్ మీట్లు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇది తనతో పాటు అందరికీ వర్తిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ నేతలు హూందాగా ప్రవర్తించాలని సూచించారు.