రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి
హైదరాబాద్ :
భారతదేశాన్ని ఆధునిక టెక్నాలజీ వైపు నడిపించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని , ఆయన ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ వ్యవస్థ టెలికాం విప్లవం కంప్యూటర్ రంగానికి ఆయన అందించిన ప్రోత్సాహం చాలా గొప్పవని, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి కొనియాడారు. భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34 వ వర్ధంతి సందర్భంగా…గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాన్సర్ భాధితుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి అధ్యక్షులు ఎంఎల్సి మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు , మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ , రాష్ట్ర మత్స్యకారుల కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ , రాష్ట్ర TMREIS వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి , మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ సయ్యద్ ఖాలీద్ పాల్గొన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారిని అభినందించి ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది…ఈ సందర్బంగా జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ… రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని ఆధునిక టెక్నాలజీ వైపు నడిపించిన గొప్ప నాయకుడని, ఆయన ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ వ్యవస్థ టెలికాం విప్లవం కంప్యూటర్ రంగానికి ఆయన అందించిన ప్రోత్సాహం చాలా గొప్పవని, కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పలు జిల్లాల,నియోజకవర్గాల, మండలాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.