రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఫైర్.
తెలుగునాడు, న్యూఢిల్లీ :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను పొడిగించి కాలయాపన చేస్తున్నట్టు బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా సమావేశంఈ విచారణకు గడువు పూర్తయినా, దానికి సంబంధించి ఎవరికైనా నిర్దిష్ట బాధ్యత కేటాయించకుండా, విచారణను నీరు కార్చుతున్నట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విచారణ గడువు పూర్తయినప్పటికీ, ప్రతి రోజూ కొందరు మాత్రమే విచారణకు హాజరయ్యేలా సమన్లు పంపుతూ, విచారణను నిర్ధిష్టంగా కొనసాగించక గడువును మళ్లీ పొడిగిస్తోందని ఆయన విమర్శించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇలాంటివి గతంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విచారణలో కూడా జరిగాయని, దాన్ని నీరుగార్చడం వలన దోషులను శిక్షించలేని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే పునరావృతమవుతోందని హెచ్చరించారు. కాళేశ్వరం విచారణ విషయంలో కూడా అదే పరిస్థితి దృష్టిలోకి వస్తోందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినదిగా, రైతులకు కావలసిన మద్దతు అందకుండా, అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎన్.వి.ఎస్.ఎస్. ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే విద్యార్థుల ఫీజు రీఇంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం, పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉన్నత విద్య సాధించడంలో సమస్యలు ఎదుర్కొంటున్న విషయాలను కూడా ఆయన తెలిపారు. కేంద్ర పథకాల అమలు బాటలో తెలంగాణ ప్రభుత్వం బలహీనంగా ఉందని, కేంద్ర పీఎం కుసుమ్ పథకం వంటి పథకాల సబ్సిడీలను కూడా విడుదల చేయడంలో విఫలమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాల అమలుకు ఆటంకాలు కలిగిస్తూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు నష్టమే చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీల మధ్య డీల్స్, అంతర్గత ఒప్పందాలు ప్రజలకు మేలు చేయవని, బిజెపి మాత్రం ప్రజల కోసం నిజాలను బయటపెట్టి ప్రజల శ్రేయస్సు కోసం నిలబడుతుందని ఎన్.వి.ఎస్.ఎస్. పేర్కొన్నారు.ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో పెద్ద చేరికలు లేనప్పటికీ, ప్రజల మద్దతుతో తెలంగాణలో మరింత బలోపేతం అవుతుందన్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడి ఎన్నిక ప్రజాస్వామ్య విధానంలో, సమయానుగుణంగా జరుగుతుందని పేర్కొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.