స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ : 

రాష్ట్రంలో కొత్త టెక్నాలజీ అనుసంధానం చేస్తూ కోటి రేషన్ కార్డులన్నింటిని ఎటిఎం తరహా స్మార్ట్(చిప్) కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పం మరింత జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసే చర్యల్లో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గత కొన్ని నెలలుగా ఎంతో కసరత్తు చేసింది. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న తీరుతెన్నులను పరిశీలించింది. దాంతో వాటి కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే మెరుగైన పరిస్థితులు ఉన్నాయన్న అభిప్రాయానికి వచ్చారు. దాంతో పటిష్టమైన నిబంధనలతో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల తయారీ ఏజెన్సీల ఖరారుకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది.