ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Facebook
X
LinkedIn

మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డి

తెలుగునాడు, మేడ్చల్‌ జిల్లా ప్రతినధి :
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను డిఆర్‌ఓ హరిప్రియ తో కలిసి మేడ్చెల్‌ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డి స్వీకరించారు. మేడ్చెల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో (82) ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టరు సూచించారు.


ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధ శాఖలలో ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్‌ పోర్టల్‌ లో అప్లోడ్‌ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, అర్జీలను పెండిరగ్‌ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజాభవన్‌ నుండి ఆన్‌ లైన్‌ లో వచ్చిన దరఖాస్తులను త్రిప్పి పంపే సందర్భంలో ఎందుకు త్రిప్పి పంపుతున్నారో వివరంగా సమాచారమిస్తూ దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లా ఆఫీసర్‌ చంద్రావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.